కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- February 04, 2026
కువైట్: కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ ను ట్రాఫిక్ డిపార్టుమెంట్ ప్రారంభించనుంది. టాక్సీలు, డెలివరీ వాహనాలు, కార్లు మరియు ప్రజా రవాణా సేవలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతికతల ఆధారంగా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అల్-అద్వానీ ప్రకటించారు.
ట్రాఫిక్ భద్రతను బలోపేతం చేయడం మరియు కువైట్ విజన్ 2035కి అనుగుణంగా రవాణా మరియు స్మార్ట్ సేవల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ ఫోరమ్ లక్ష్యమని అల్-అద్వానీ వెల్లడించారు.
కొత్త వ్యవస్థ ట్రాఫిక్ ను పర్యవేక్షించడం, ఉల్లంఘనలను గుర్తించడం మరియు ఉల్లంఘనలు జరిగిన వెంటనే ఆటోమెటిక్ గా జరిమానాలు జారీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇది ట్రాఫిక్ క్రమశిక్షణను పెంచుతుందని మరియు మొత్తం రహదారి భద్రతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్









