కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- February 04, 2026
కువైట్: కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ ను ట్రాఫిక్ డిపార్టుమెంట్ ప్రారంభించనుంది. టాక్సీలు, డెలివరీ వాహనాలు, కార్లు మరియు ప్రజా రవాణా సేవలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతికతల ఆధారంగా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అల్-అద్వానీ ప్రకటించారు.
ట్రాఫిక్ భద్రతను బలోపేతం చేయడం మరియు కువైట్ విజన్ 2035కి అనుగుణంగా రవాణా మరియు స్మార్ట్ సేవల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ ఫోరమ్ లక్ష్యమని అల్-అద్వానీ వెల్లడించారు.
కొత్త వ్యవస్థ ట్రాఫిక్ ను పర్యవేక్షించడం, ఉల్లంఘనలను గుర్తించడం మరియు ఉల్లంఘనలు జరిగిన వెంటనే ఆటోమెటిక్ గా జరిమానాలు జారీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇది ట్రాఫిక్ క్రమశిక్షణను పెంచుతుందని మరియు మొత్తం రహదారి భద్రతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







