కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- February 04, 2026
కువైట్: కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ ను ట్రాఫిక్ డిపార్టుమెంట్ ప్రారంభించనుంది. టాక్సీలు, డెలివరీ వాహనాలు, కార్లు మరియు ప్రజా రవాణా సేవలను పర్యవేక్షించడానికి ఏఐ సాంకేతికతల ఆధారంగా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అల్-అద్వానీ ప్రకటించారు.
ట్రాఫిక్ భద్రతను బలోపేతం చేయడం మరియు కువైట్ విజన్ 2035కి అనుగుణంగా రవాణా మరియు స్మార్ట్ సేవల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ ఫోరమ్ లక్ష్యమని అల్-అద్వానీ వెల్లడించారు.
కొత్త వ్యవస్థ ట్రాఫిక్ ను పర్యవేక్షించడం, ఉల్లంఘనలను గుర్తించడం మరియు ఉల్లంఘనలు జరిగిన వెంటనే ఆటోమెటిక్ గా జరిమానాలు జారీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇది ట్రాఫిక్ క్రమశిక్షణను పెంచుతుందని మరియు మొత్తం రహదారి భద్రతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









