భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- February 04, 2026
న్యూ ఢిల్లీ: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ భారతదేశంలో భారీ విస్తరణ చేపడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యాచరణ చేపడుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ కేంద్రంగా ఉన్న బెంగళూరులో లక్షలాది చదరపు అడుగుల కొత్త కార్యాలయ స్థలాన్ని కంపెనీ తీసుకునే అవకాశముందని ఈ నివేదిక పేర్కొంది. ఈ విస్తరణతో భారతదేశంలో గూగుల్(Google) ఉనికి గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలన హయాంలో కఠినతరం చేసిన వీసా నిబంధనలు. ముఖ్యంగా H-1B వీసాలపై విధించిన కొత్త ఆంక్షలు, పెరిగిన రుసుములు అమెరికాకు విదేశీ ప్రతిభను తీసుకురావడాన్ని కంపెనీలకు మరింత ఖరీదైనదిగా మార్చాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కో వీసా దరఖాస్తుకు అయ్యే మొత్తం ఖర్చు లక్ష డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో.. అనేక అమెరికన్ టెక్ దిగ్గజాలు తమ నియామక దృష్టిని అమెరికా వెలుపల దేశాలవైపు మళ్లించాయి. ముఖ్యంగా భారతదేశం ప్రతిభకు కేంద్రంగా మారడంతో, ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడం వారికి అనుకూలంగా మారింది. ఈ క్రమంలోనే, ఆల్ఫాబెట్ ఇప్పటికే బెంగళూరులోని వైట్ఫీల్డ్ టెక్ కారిడార్లో ఒక ఆఫీస్ టవర్ను లీజుకు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, అలెంబిక్ సిటీలోని మరో రెండు పెద్ద వాణిజ్య టవర్లపై కూడా ఎంపికలు పొందినట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. ఈ మూడు టవర్లు కలిపి సుమారు 2.4 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అందించనున్నాయి. AI బూమ్ వెనుక అసలు నిజం.. మైక్రోసాఫ్ట్, గూగుల్ను వణికిస్తున్న మెమరీ సంక్షోభం.. వైట్ఫీల్డ్ ప్రాంతం బెంగళూరులోని అత్యంత కీలకమైన ఐటీ బెల్ట్లలో ఒకటిగా ఉంది. నగరంలోని మొత్తం ఐటీ ఉత్పత్తిలో దాదాపు 22 శాతం వాటా ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఇది ప్రపంచ స్థాయి పరిశోధన అభివృద్ధి కేంద్రంగా కూడా ఎదిగింది. గత సంవత్సరం, గూగుల్ ఇక్కడే తన అతిపెద్ద బెంగళూరు క్యాంపస్ను ప్రారంభించింది. ఈ క్యాంపస్లో ఇండోర్ మినీ గోల్ఫ్, పికిల్బాల్ కోర్టులు, కార్డమమ్ టీ అందించే ఫలహారశాలలు వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
బెంగళూరులో వందలాది ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. క్లౌడ్ విభాగంలో AI ప్రాక్టీస్ డైరెక్టర్లు,చిప్ డిజైనర్లు, మెషిన్ లెర్నింగ్ నిపుణులు వంటి కీలక పాత్రలకు నియామకాలు జరుగుతున్నాయి. బ్లూమ్బెర్గ్ కథనం ప్రకారం.. ఆల్ఫాబెట్ మూడు టవర్లన్నింటినీ పూర్తిగా వినియోగించుకుంటే.. అదనంగా 20 వేల మంది ఉద్యోగులకు స్థలం లభించే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసే స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం, ఆల్ఫాబెట్ భారతదేశంలో సుమారు 14 వేల మందిని నియమించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి దాదాపు 1.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







