నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- February 05, 2026
యూఏఈ: 34 ఏళ్ల శాంతను శెట్టిగర్, డిసెంబర్ 27న బేబి గర్ల్ కు స్వాగతం పలికాడు. ఈ శుభవార్త వచ్చిన కొన్ని వారాలకే, అతనికి మరో శుభవార్త అందింది. అతను 20 మిలియన్ దిర్హమ్ల బిగ్ టికెట్ జాక్పాట్ను గెలుచుకున్నాడు. ఈ సమయం నమ్మశక్యంగా అనిపించడం లేదు అని శాంతను అన్నారు. తన కూతురే తనకు అదృష్టాన్ని తెచ్చిందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. దీనిని తాను అస్సలు ఊహించలేదని తెలిపాడు. తనకు లక్కును తెచ్చిన తన కూతురిని ఇంకా నేరుగా చూడలేదని, త్వరలోనే ఇండియాకు వెళతానని పేర్కొన్నాడు.
కర్ణాటకలోని ఉడిపికి చెందిన శాంతను, మస్కట్లో ఒక షాప్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు. అక్కడ అతను గత ఎనిమిది సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. అతను పనిలో బిజీగా ఉన్నందున బిగ్ టికెట్ డ్రాను ప్రత్యక్షంగా చూడలేదు. షో నిర్వాహకులు అతనికి ఫోన్ చేసినప్పుడు, అతను మొదటి రెండు కాల్స్ను మిస్ అయ్యాడు. మూడోసారి ఫోన్ కాల్ కు అటెండ్ అయ్యాయని, మొదట అది నిజమని తాను అనుకోలేదని తెలిపాడు.
శాంతను సుమారు ఐదేళ్లుగా బిగ్ టికెట్లో పాల్గొంటున్నాడు. కానీ గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్ ప్రతి డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. డబ్బు గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, సమయం తీసుకొని బాగా ఆలోచించి, ప్రణాళిక వేసుకుంటానని తెలిపాడు. అయితే, తన కుటుంబాన్ని మస్కట్కు తీసుకువచ్చి కలిసి జీవించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









