నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- February 05, 2026
యూఏఈ: 34 ఏళ్ల శాంతను శెట్టిగర్, డిసెంబర్ 27న బేబి గర్ల్ కు స్వాగతం పలికాడు. ఈ శుభవార్త వచ్చిన కొన్ని వారాలకే, అతనికి మరో శుభవార్త అందింది. అతను 20 మిలియన్ దిర్హమ్ల బిగ్ టికెట్ జాక్పాట్ను గెలుచుకున్నాడు. ఈ సమయం నమ్మశక్యంగా అనిపించడం లేదు అని శాంతను అన్నారు. తన కూతురే తనకు అదృష్టాన్ని తెచ్చిందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. దీనిని తాను అస్సలు ఊహించలేదని తెలిపాడు. తనకు లక్కును తెచ్చిన తన కూతురిని ఇంకా నేరుగా చూడలేదని, త్వరలోనే ఇండియాకు వెళతానని పేర్కొన్నాడు.
కర్ణాటకలోని ఉడిపికి చెందిన శాంతను, మస్కట్లో ఒక షాప్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు. అక్కడ అతను గత ఎనిమిది సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. అతను పనిలో బిజీగా ఉన్నందున బిగ్ టికెట్ డ్రాను ప్రత్యక్షంగా చూడలేదు. షో నిర్వాహకులు అతనికి ఫోన్ చేసినప్పుడు, అతను మొదటి రెండు కాల్స్ను మిస్ అయ్యాడు. మూడోసారి ఫోన్ కాల్ కు అటెండ్ అయ్యాయని, మొదట అది నిజమని తాను అనుకోలేదని తెలిపాడు.
శాంతను సుమారు ఐదేళ్లుగా బిగ్ టికెట్లో పాల్గొంటున్నాడు. కానీ గత మూడు సంవత్సరాలుగా రెగ్యులర్ ప్రతి డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు. డబ్బు గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, సమయం తీసుకొని బాగా ఆలోచించి, ప్రణాళిక వేసుకుంటానని తెలిపాడు. అయితే, తన కుటుంబాన్ని మస్కట్కు తీసుకువచ్చి కలిసి జీవించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు.
తాజా వార్తలు
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!







