నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- February 07, 2026
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 (T20 WC) ఇవాళ్టి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల చూపంతా ఈ మెగా టోర్నీపై ఉంది.. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తోంది. కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్కు ముందు టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు.
వేడుకల్లో ప్రముఖులు
టోర్నమెంట్ ట్రోఫీని ఐసీసీ చైర్మన్ జై షా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకొస్తారు. టోర్నీలో పాల్గొంటున్న 20 దేశాలకు ప్రతీకగా 20 మంది చిన్నారులు వారితో జతకలవనున్నారు. అనంతరం అందరూ కలిసి టోర్నమెంట్ను అధికారికంగా ప్రారంభిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్, ర్యాపర్ బాద్షా తన పాటలతో, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహీ తన డ్యాన్స్తో అలరించనున్నారు. చివరగా ఇద్దరూ కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.
అలాగే శివమణి, రిషభ్ రిఖిరామ్ శర్మల ప్రదర్శనలు కూడా ఉంటాయి. మైదానం మధ్యలో టోర్నీ అధికారిక లోగోను వేదికగా మార్చి ప్రదర్శనలు నిర్వహిస్తారు. కార్యక్రమం ముగింపులో అద్భుతమైన పైరోటెక్నిక్ ప్రదర్శన (బాణసంచా) ఉంటుంది. అయితే, ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యక్ష ప్రసారం గానీ, లైవ్ స్ట్రీమింగ్ గానీ ఉండవని నిర్వాహకులు స్పష్టం చేశారు. కేవలం భారత్-యూఎస్ఏ మ్యాచ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియంలో దీనిని ప్రత్యక్షంగా వీక్షించగలరు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







