యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- February 10, 2026
యూఏఈ: రైల్వే ట్రాక్లపై ప్రయాణించగల ప్రత్యేక అంబులెన్స్.. యూఏఈ మరియు సౌదీ అరేబియాలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా మారుమూల ఎడారి ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలను అందివ్వనుంది. నాఫ్కో స్థానికంగా నిర్మించిన ఈ వాహనం సాంప్రదాయ అంబులెన్స్లు చేరుకోవడానికి ఇబ్బందులుండే ప్రాంతాలను సైతం ఇది నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
యూఏఈ మరియు సౌదీ అరేబియా విస్తృతమైన రైలు నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నందున, ఈ రైలు అంబులెన్స్లు ఇతర అంబులన్స్ లు ప్రవేశించలేని ప్రాంతాలలోని పేషంట్లను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని నాఫ్కో FZCOలో సేల్స్ అకౌంట్ మేనేజర్ మొహమ్మద్ అబ్దుల్ జబ్బర్ ప్రపంచ ఆరోగ్య ఎక్స్పో (WHX) సందర్భంగా వెల్లడించారు. ఈ రైలు అంబులెన్స్ లో అత్యవసర సంరక్షణ కోసం స్లైడింగ్ ప్లెక్సిగ్లాస్, ఆక్సిజన్ మరియు వాక్యూమ్ సిస్టమ్లు, DC మరియు AC పవర్ అవుట్లెట్లు, షార్ప్ ల కంటైనర్లు, ఇన్సులేటెడ్ కిటికీలు మరియు ఫోల్డబుల్ స్టెప్లతో వెనుకవైపు మెడికల్ క్యాబినెట్ను కలిగి ఉంటుంది. ఇక వైద్య పరికరాలలో ప్రధాన స్ట్రెచర్, మెట్ల కుర్చీ, స్కూప్ మరియు ఫోల్డింగ్ స్ట్రెచర్లు, AED (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్), పోర్టబుల్ వెంటిలేటర్, స్పైన్ బోర్డ్, ట్రాక్షన్ స్ప్లింట్, ప్రథమ చికిత్స మరియు ట్రామా కిట్లు, సక్షన్ యూనిట్ మరియు దుప్పట్లు మరియు శానిటైజర్లు వంటి అవసరమైన రోగి సంరక్షణ పరికరాలు ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







