బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- February 11, 2026
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం భారత బడ్జెట్ 2026 పై సెమినార్ నిర్వహించింది. యూనియన్ బడ్జెట్ ప్రత్యేకతలు, కల్పించిన రాయితీలు, అవకాశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్ నబీ అల్ షోలా; స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బహ్రెయిన్ కంట్రీ హెడ్ మధు రామన్కుట్టి; ICICI సీనియర్ ఫండ్ మేనేజర్ ఇహాబ్ దల్వాయి , బహ్రెయిన్- ఇండియా సొసైటీ చైర్మన్ అబ్దుల్రహ్మాన్ జుమా పాల్గొన్నారు.
భారత రాయబారి వినోద్ కె. జాకబ్ మాట్లాడుతూ.. భారత బడ్జెట్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని, 7.4 శాతం వృద్ధి అంచనాతో USD 4.13 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక GDPలో 4.3 శాతం ఆర్థిక లోటు మరియు 55.6 శాతం రుణ-GDP నిష్పత్తి ఉందని రాయబారి హైలైట్ చేశారు.
భారతదేశాన్ని విశ్వసనీయ ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపేందుకు, ఆర్థిక సంస్కరణలు, వ్యాపార సౌలభ్యత, దీర్ఘకాలిక వృద్ధి, ప్రజల-కేంద్రీకృత అభివృద్ధిపై భారత ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వాణిజ్య పరిణామాలను ప్రస్తావిస్తూ, చారిత్రాత్మక భారత్ -ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో భారత్ యొక్క నిబద్ధతను తెలియజేస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









