నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- February 11, 2026
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ State Bank of India (SBI) షేర్ మార్కెట్లో సరికొత్త మైలురాయిని చేరుకుని పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ అందించింది. బుధవారం ఎన్ఎస్ఈలో షేర్ ధర 3.8 శాతం పెరిగి రూ.1,187కు చేరి ఆల్టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ.38,000 కోట్లకు పైగా పెరిగి రూ.10.94 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలతో ఎస్బీఐ దేశంలో నాల్గవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించి టీసీఎస్ను అధిగమించింది.
ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 10.5 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ షేర్ ధర 2024, ఆగష్టు 30న నమోదైన రూ. 4,552 ఆల్టైమ్ రికార్డు గరిష్ఠం నుంచి 36 శాతం పడిపోయి, బుధవారం రూ. 2,909 వద్ద ఉంది. ఇక, ఎస్బీఐ కంటే ముందు, దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రూ. 19.87 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత హెచ్ఎఎఫ్సీ బ్యాంక్(రూ. 14.26 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్(రూ. 11.5 లక్షల కోట్లు) అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









