కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- February 11, 2026
కెనడాలో ఘోరం జరిగింది. బ్రిటిష్ కొలంబియాలోని పీస్ ప్రాంతంలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. 25 మందికి గాయాలయ్యాయి. నిందితుడు కూడా తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం గోధుమ రంగు జుట్టు కలిగిన వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డాడు. ఘటనాస్థలిలో 8 మంది చనిపోగా.. సమీపంలోని ఇంటి దగ్గర మరో ఇద్దరు చనిపోయారు. మొత్తంగా 10 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో జరిగినట్లుగా వెల్లడించారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









