ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- February 11, 2026
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 6వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు. 16 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరగనుంది. చర్చ అనంతరం 18వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్పై సభకు సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి కావడంతో, మరుసటి రోజున అంటే 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి అవసరమైతే సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం కూడా ఉందని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









