ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- February 11, 2026
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 6వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు. 16 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరగనుంది. చర్చ అనంతరం 18వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్పై సభకు సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి కావడంతో, మరుసటి రోజున అంటే 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి అవసరమైతే సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం కూడా ఉందని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







