నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- February 11, 2026
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ State Bank of India (SBI) షేర్ మార్కెట్లో సరికొత్త మైలురాయిని చేరుకుని పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ అందించింది. బుధవారం ఎన్ఎస్ఈలో షేర్ ధర 3.8 శాతం పెరిగి రూ.1,187కు చేరి ఆల్టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ.38,000 కోట్లకు పైగా పెరిగి రూ.10.94 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలతో ఎస్బీఐ దేశంలో నాల్గవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించి టీసీఎస్ను అధిగమించింది.
ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 10.5 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ షేర్ ధర 2024, ఆగష్టు 30న నమోదైన రూ. 4,552 ఆల్టైమ్ రికార్డు గరిష్ఠం నుంచి 36 శాతం పడిపోయి, బుధవారం రూ. 2,909 వద్ద ఉంది. ఇక, ఎస్బీఐ కంటే ముందు, దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రూ. 19.87 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత హెచ్ఎఎఫ్సీ బ్యాంక్(రూ. 14.26 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్(రూ. 11.5 లక్షల కోట్లు) అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









