యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- February 12, 2026
యూఏఈ: రమదాన్ సందర్భంగా ధరలు పెంచితే భారీ జరిమానా విధిస్తామని రిటైలర్లను ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి Dh100,000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి స్పష్టం చేశారు. కొంతమంది రిటైలర్లు చట్టాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించారని, సరఫరాదారులు మరియు రిటైలర్లు కుమ్మకై కృత్రిమ డిమాండ్ ను సృష్టించి భారీగా ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. జనవరి 2025లో ప్రవేశపెట్టబడిన కొత్త ధరల విధానం ప్రకారం.. గుడ్లు, పౌల్ట్రీ, వంట నూనెలు, చక్కెర, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు మరియు బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కఠిన నియంత్రణలు అమల్లో ఉంటాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. గత సంవత్సరం రమదాన్ సమయంలో ధరల పెరుగుదలకు సంబంధించి మంత్రిత్వ శాఖ 3,167 ఫిర్యాదులు మరియు 7,702 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







