యూఏఈలో ధరలు పెంచితే..Dh100,000 వరకు జరిమానా..!!
- February 12, 2026
యూఏఈ: రమదాన్ సందర్భంగా ధరలు పెంచితే భారీ జరిమానా విధిస్తామని రిటైలర్లను ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి Dh100,000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి స్పష్టం చేశారు. కొంతమంది రిటైలర్లు చట్టాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించారని, సరఫరాదారులు మరియు రిటైలర్లు కుమ్మకై కృత్రిమ డిమాండ్ ను సృష్టించి భారీగా ధరలను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. జనవరి 2025లో ప్రవేశపెట్టబడిన కొత్త ధరల విధానం ప్రకారం.. గుడ్లు, పౌల్ట్రీ, వంట నూనెలు, చక్కెర, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు మరియు బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కఠిన నియంత్రణలు అమల్లో ఉంటాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. గత సంవత్సరం రమదాన్ సమయంలో ధరల పెరుగుదలకు సంబంధించి మంత్రిత్వ శాఖ 3,167 ఫిర్యాదులు మరియు 7,702 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









