వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- February 13, 2026
హైదరాబాద్: విఖ్యాత ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బి.వి. పట్టాభిరామ్ జయంతిని ప్రతి ఏటా “ఇంద్రజాల దినోత్సవం”గా గుర్తించాలని ప్రముఖులు ప్రభుత్వాలను కోరారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు నలభై మందికి పైగా ఇంద్రజాలికుల భిన్నమైన మాయాజాల ప్రదర్శనలతో అద్భుతంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ, పట్టాభిరామ్ శిష్యరికంలో ఎందరో ఇంద్రజాలికులు ఎదిగి స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఆయన జయంతిని అధికారికంగా ఇంద్రజాలికుల దినోత్సవంగా గుర్తించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ, తెలుగు ఇంద్రజాలికులకు పట్టాభిరామ్ ఒక గురువు, మార్గదర్శి అని పేర్కొన్నారు. ప్రముఖ సంపాదకుడు కె. రామచంద్ర మూర్తి పట్టాభిరామ్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ, 1990 తర్వాత తెలుగు ఇంద్రజాల రంగంలో పట్టాభిరామ్ విశిష్ట స్థానాన్ని సంపాదించారని, ఉత్తమ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎందరో జీవితాలను ప్రభావితం చేశారని తెలిపారు.
వంశీ రామరాజు మాట్లాడుతూ, పట్టాభిరామ్ పేరిట ప్రారంభించిన తొలి అవార్డును ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్కు ప్రకటించారు. కార్యక్రమంలో చొక్కాపు రమణ, జర్నలిస్ట్ వల్లీశ్వర్, వాణి ఉప్పల, పట్టాభిరామ్ సతీమణి జయ,ఫణి మాధవ్ కస్తూరి, కుమారుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సుంకరపల్లి శైలజ పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







