ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ

- February 18, 2026 , by Maagulf
ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ

న్యూ ఢిల్లీ: భారతదేశం ఒక గొప్ప సాంకేతిక పరివర్తనకు నాంది పలుకుతోందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషించనుందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.ప్రస్తుత దశను పరివర్తన సమయంగా ఆయన అభివర్ణించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇది టెక్నాలజీ, ఆవిష్కరణలు, ఏఐ విస్తృత వినియోగంతో నడిచే ఒక దశాబ్ద కాలపు మార్పుకు నాందిలా అనిపిస్తోంది అని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధి పొందేందుకు భారతదేశం ప్రత్యేకమైన స్థితిలో ఉందని, అయితే ఈ అవకాశంతో పాటు గొప్ప బాధ్యత కూడా ఉంటుందని సుందర్ పిచాయ్ నొక్కిచెప్పారు. 

గత కొన్నేళ్లుగా భారత్ డిజిటల్ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించిందని పిచాయ్ ప్రశంసించారు. భారతీయ వినియోగదారులు వాయిస్ ఆధారిత, ఇమేజ్ ఆధారిత సెర్చ్‌లను ప్రపంచంలోనే అత్యధికంగా స్వీకరిస్తున్నారు. ఇది దేశ ప్రజలు కొత్త టెక్నాలజీలను ఎంత వేగంగా అందిపుచ్చుకుంటున్నారో చూపిస్తోంది, అని ఆయన తెలిపారు. గూగుల్ ఏఐ టూల్ ‘జెమినై’కి భారతదేశం అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా నిలవడం, ఇక్కడి వినియోగదారులలో ఏఐ పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని అన్నారు.

ఈ పర్యటనలో భాగంగా, సుందర్ పిచాయ్ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏఐ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులతో గూగుల్ ఎలా కలిసి పనిచేయగలదనే అంశాలపై వారు చర్చించారు. ఈ భేటీపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఏఐ రంగంలో ప్రభుత్వం, గూగుల్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకునే అవకాశాలపై పిచాయ్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com