నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- February 19, 2026
అహ్మదాబాద్: టీ20 ప్రపంచ కప్ లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ మరో గెలుపు సాధించింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొట్టింది. 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 194 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ను 176/7 రన్స్ కే పరిమితం చేసింది భారత్.
దీంతో 17 రన్స్ తేడాతో టీమిండియా గెలుపొందింది. కాగా 19 ఓవర్ లో 18 పరుగులు రావడంతో ఉత్కంఠకు దారితీసింది. అయితే, చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగాడు. దూబే రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్తో మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. డకౌట్ అయ్యాడు. శివం దూబే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లోనే 66 పరుగులు బాదాడు. 6 సిక్సులు, 4 ఫోర్లు కొట్టాడు. హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్ ఆడాడు. 21 బంతుల్లోనే 30 రన్స్ చేశాడు. 3 సిక్సులు కొట్టాడు. ఇషాన్ కిషన్ 18 పరుగులు, తిలక్ వర్మ 31, సూర్యకుమార్ యాదవ్ 34, రింకు సింగ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు.
కాగా, టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యాడు. నెదర్లాండ్స్పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









