ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!
- February 21, 2026
దోహా: ఖతార్ లో మొబైల్ ఫోన్ లలో ముందస్తు హెచ్చరిక మెసేజులపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రజా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం మరియు జాతీయ హెచ్చరిక విధానాల సంసిద్ధతను నిర్ధారించడంలో భాగంగానే వాటిని పంపినట్లు సోషల్ మీడియా పోస్ట్ లో క్లారిటీ ఇచ్చింది.
ఖతార్ లోని చాలా ప్రాంతాలలో పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిందని అందుకు అనుగుణంగా మొబైల్ ఫోన్లకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా మెసేజులను పంపినట్లు తెలిపింది. ఎమర్జెన్సీ అలెర్ట్ వ్యవస్థ సామర్థ్యాన్ని పరీక్షించడానికి, హెచ్చరిక స్థాయిలను అంచనా వేయడానికి మరియు రియల్ టైమ్ పరిస్థితులలో మెసేజులను ప్రజలకు వేగంగా సమాచారాన్ని చేరవేయడానికి ప్రయత్నించినట్లు పేర్కొంది.
ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే తక్షణ హెచ్చరిక సాధనంగా పరిగణించబడుతుందని, దీని ద్వారా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు వెంటనే తీసుకోవడానికి వీలుగా అన్ని మొబైల్స్ కు మెసేజులు డెలివరీ అవుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రజలు అలాంటి హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని మరియు వాటిలో ఉన్న సూచనలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!









