ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- February 21, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో అత్యంత సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన తుది నివేదికను పరిశీలించిన అనంతరం, కేసును మూసివేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు.
2007లో జరిగిన ఆయేషా మీరా హత్య తర్వాత పోలీసులు, పలువురు అమాయకుల్ని నిందితులుగా చేర్చి ఈ కేసును క్లోజ్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన తప్పుడు కేసుల్ని కోర్టులు కొట్టేయడంతో ఆ అమాయకులకు ఊరట లభించింది. అయితే ఇప్పటికీ ఆయేషా మీరా కుటుంబం మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన సీబీఐ..ఆయేషా మీరా సమాధిని తవ్వి అవశేషాల్ని సేకరించింది.వీటిని కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ నివేదికను అందజేసింది.
అయితే ఇందులో నిందితుల ప్రస్తావన ఉందో లేదో ఇంకా తేలలేదు. అయితే న్యాయప్రక్రియ పూర్తి కావడంతో సీబీఐ సేకరించిన తమ కుమార్తె అవశేషాల్ని తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లితండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ పాషా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..సీబీఐని ఆమె అవశేషాల్ని తిరిగి కుటుంబానికి అప్పగించేలా ఆదేశాలు ఇచ్చింది.దీంతో ఈ నెల 27న మరోమారు కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ తల్లితండ్రులు సిద్దమవుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







