‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం
- February 21, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధం చేసిన ‘స్వచ్ఛ రథాన్ని’ ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 561 పొదుపు సంఘాలకు రూ.100.14 కోట్ల భారీ రుణాల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ఈ నిధులు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









