‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం
- February 21, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధం చేసిన ‘స్వచ్ఛ రథాన్ని’ ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 561 పొదుపు సంఘాలకు రూ.100.14 కోట్ల భారీ రుణాల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ఈ నిధులు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









