భారీ వర్షాల సూచన.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- February 24, 2026
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి మరియు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఫిబ్రవరి 24న రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముంది. వర్షాలతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ పనులు, రవాణా విషయంలో జాగ్రత్తలు అవసరం.
ఫిబ్రవరి 25న ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. రైతులు పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలి. విద్యుత్ స్తంభాలు, చెట్లు దగ్గర నిలబడకుండా జాగ్రత్త పడాలి. తాజా వాతావరణ సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అనుసరించడం మంచిది.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









