మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!

- February 25, 2026 , by Maagulf
మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!

మనామాః పెట్టుబడిదారులను లక్షలాది రూపాయల మోసం చేసినందుకు దోషిగా తేలిన వ్యాపారవేత్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 100,000 బహ్రెయిన్ దినార్ల జరిమానాను హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. నేరం ద్వారా వచ్చిన డబ్బును జప్తు చేసి బాధితులకు తిరిగి చెల్లించాలని, ఇద్దరు హక్కుదారులకు తాత్కాలిక పౌర పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది. 2020 మరియు 2023 మధ్య నిందితుడు రియల్ ఎస్టేట్, కంపెనీల నిర్మాణం, లగ్జరీ కార్లు, గడియారాలు మరియు ప్రత్యేక వాహన నంబర్ ప్లేట్లలో నిపుణుడిగా పరిచయం తీసుకొని ట్రస్ట్ నెట్‌వర్క్‌ను నిర్మించాడు. అధిక లాభాలను ఆశచూపి అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేశాడు. కోర్టు తీర్పులో మొదటి హక్కుదారునికి 6,000 దినార్లు మరియు రెండవ వ్యక్తికి 1,000 దినార్ల తాత్కాలిక పౌర పరిహారం కూడా ఉంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com