టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- February 24, 2026
ICC T20 World Cup 2026 తుది దశకు చేరుకుంటున్న వేళ క్రికెట్ అభిమానులకు ఐసీసీ కీలక సమాచారం వెల్లడించింది. సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్ల టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లలో ప్రారంభమవుతుందని ప్రకటించింది.
టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 4న తొలి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్, మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. రెండో సెమీఫైనల్కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఖరారైంది.
పాకిస్థాన్ ప్రదర్శనపై వేదిక నిర్ణయం
తొలి సెమీఫైనల్, ఫైనల్ వేదికలు పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయని ఐసీసీ వెల్లడించింది.
- పాకిస్థాన్ సెమీఫైనల్కు అర్హత సాధిస్తే — మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది.
- పాక్ అర్హత సాధించకపోతే, శ్రీలంక సెమీస్కు చేరి భారత్తో ఆడని పరిస్థితిలో — మ్యాచ్ కొలంబోలోనే ఉంటుంది.
- పై పరిస్థితులు లేకపోతే తొలి సెమీఫైనల్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక అవుతుంది.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









