నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- February 25, 2026
జెరూసలేం: రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం Israelకు చేరుకున్నారు. టెల్ అవీవ్లోని బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆ దేశ ప్రధాని Benjamin Netanyahu స్వయంగా విచ్చేసి ఘన స్వాగతం పలకడం విశేషంగా నిలిచింది. ప్రోటోకాల్ను పక్కనపెట్టి స్వాగతం పలకడం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రతిబింబించింది.
2017లో తొలిసారి ఇజ్రాయెల్ పర్యటించిన మోదీ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ దేశాన్ని సందర్శించడం భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ Knessetను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో ప్రసంగించే తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నెస్సెట్ భవనాన్ని భారత త్రివర్ణ పతాక రంగులతో అలంకరించడం విశేషం.
ఇరువురు నేతలు పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. రేపు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థిక, భద్రత, రక్షణ, సాంకేతికత, వ్యవసాయం వంటి రంగాల్లో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ సాంకేతికత సహకారం, ఇన్నోవేషన్ భాగస్వామ్యం కీలక అంశాలుగా ఉండనున్నాయి.
మోదీ పర్యటనను పురస్కరించుకుని ఇజ్రాయెల్ మీడియా “నమస్తే… షాలోమ్” అంటూ ప్రత్యేక కథనాలతో స్వాగతం పలికింది. మోదీ–నెతన్యాహు మధ్య వ్యక్తిగత స్నేహం రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన బంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయులతో కూడా సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









