యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- February 26, 2026
యూఏఈ: ఇండియా-యూఏఈ మధ్య విమాన ఛార్జీలు ఇతర అంతర్జాతీయ మార్గాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. వేసవి సెలవులు వంటి రద్దీ ప్రయాణ సీజన్లలో సగటు విమాన ఛార్జీలు 25 శాతం వరకు పెరుగుతాయని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా మరియు యూకే వంటి ఇతర రద్దీగా ఉండే గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు వాటి గరిష్ట సమయాల్లో 20 శాతం కంటే తక్కువ పెరుగుతాయని తెలిపారు.
ఫిబ్రవరి నెలలో ఫ్లైట్ సీట్ల సామర్థ్యం పరంగా యూఏఈ-ఇండియా మరియు యూఏఈ-సౌదీ అరేబియా ఎయిర్ కారిడార్లు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే 20 ఎయిర్ కారిడార్లలో ఒకటిగా నిలిచాయి. 2.08 మిలియన్ సీట్లతో ఇండియా-యూఏఈ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఐదవ ఎయిర్ రూట్ గా నిలిచిందని పినోయ్ టూరిజం సీఈఓ ఇంతియాజ్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సెలవులు మరియు పండుగ ప్రయాణ సమయాల్లో ఈ రూట్ లో రద్దీ పీక్ కు చేరుతుందన్నారు.
ఇక మొత్తం ప్రయాణీకుల సంఖ్య పరంగా ఇండియా యూఏఈ యొక్క అతిపెద్ద మార్కెట్గా ఉన్నప్పటికీ, యూఏఈ-సౌదీ కారిడార్ ప్రస్తుతం వేగవంతమైన శాతం వృద్ధిని సాధిస్తోందని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార కార్యకలాపాలు మరియు బలమైన ద్వైపాక్షిక ఒప్పందాలు ఈ పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









