యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- February 26, 2026
యూఏఈ: ఇండియా-యూఏఈ మధ్య విమాన ఛార్జీలు ఇతర అంతర్జాతీయ మార్గాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. వేసవి సెలవులు వంటి రద్దీ ప్రయాణ సీజన్లలో సగటు విమాన ఛార్జీలు 25 శాతం వరకు పెరుగుతాయని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా మరియు యూకే వంటి ఇతర రద్దీగా ఉండే గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు వాటి గరిష్ట సమయాల్లో 20 శాతం కంటే తక్కువ పెరుగుతాయని తెలిపారు.
ఫిబ్రవరి నెలలో ఫ్లైట్ సీట్ల సామర్థ్యం పరంగా యూఏఈ-ఇండియా మరియు యూఏఈ-సౌదీ అరేబియా ఎయిర్ కారిడార్లు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే 20 ఎయిర్ కారిడార్లలో ఒకటిగా నిలిచాయి. 2.08 మిలియన్ సీట్లతో ఇండియా-యూఏఈ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఐదవ ఎయిర్ రూట్ గా నిలిచిందని పినోయ్ టూరిజం సీఈఓ ఇంతియాజ్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సెలవులు మరియు పండుగ ప్రయాణ సమయాల్లో ఈ రూట్ లో రద్దీ పీక్ కు చేరుతుందన్నారు.
ఇక మొత్తం ప్రయాణీకుల సంఖ్య పరంగా ఇండియా యూఏఈ యొక్క అతిపెద్ద మార్కెట్గా ఉన్నప్పటికీ, యూఏఈ-సౌదీ కారిడార్ ప్రస్తుతం వేగవంతమైన శాతం వృద్ధిని సాధిస్తోందని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార కార్యకలాపాలు మరియు బలమైన ద్వైపాక్షిక ఒప్పందాలు ఈ పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!







