యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- February 26, 2026
యూఏఈ: ఇండియా-యూఏఈ మధ్య విమాన ఛార్జీలు ఇతర అంతర్జాతీయ మార్గాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. వేసవి సెలవులు వంటి రద్దీ ప్రయాణ సీజన్లలో సగటు విమాన ఛార్జీలు 25 శాతం వరకు పెరుగుతాయని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా మరియు యూకే వంటి ఇతర రద్దీగా ఉండే గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు వాటి గరిష్ట సమయాల్లో 20 శాతం కంటే తక్కువ పెరుగుతాయని తెలిపారు.
ఫిబ్రవరి నెలలో ఫ్లైట్ సీట్ల సామర్థ్యం పరంగా యూఏఈ-ఇండియా మరియు యూఏఈ-సౌదీ అరేబియా ఎయిర్ కారిడార్లు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే 20 ఎయిర్ కారిడార్లలో ఒకటిగా నిలిచాయి. 2.08 మిలియన్ సీట్లతో ఇండియా-యూఏఈ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఐదవ ఎయిర్ రూట్ గా నిలిచిందని పినోయ్ టూరిజం సీఈఓ ఇంతియాజ్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా పాఠశాల సెలవులు మరియు పండుగ ప్రయాణ సమయాల్లో ఈ రూట్ లో రద్దీ పీక్ కు చేరుతుందన్నారు.
ఇక మొత్తం ప్రయాణీకుల సంఖ్య పరంగా ఇండియా యూఏఈ యొక్క అతిపెద్ద మార్కెట్గా ఉన్నప్పటికీ, యూఏఈ-సౌదీ కారిడార్ ప్రస్తుతం వేగవంతమైన శాతం వృద్ధిని సాధిస్తోందని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార కార్యకలాపాలు మరియు బలమైన ద్వైపాక్షిక ఒప్పందాలు ఈ పెరుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









