ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- February 26, 2026
దోహా: 2025 మూడవ త్రైమాసికానికి ఖతార్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) సర్వే ఫలితాలను ఖతార్ సెంట్రల్ బ్యాంక్ సహాయంతో జాతీయ ప్రణాళిక మండలి (NPC) విడుదల చేసింది. ఇన్వర్డ్ FDI స్థానాల్లో 7% వృద్ధి చెందిందని వెల్లడించింది.ఖతార్ ఆర్థిక వ్యవస్థ పై విదేశీ పెట్టుబడిదారులలో బలమైన విశ్వాసాన్ని ఈ పెరుగుదల ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
ఈ పనితీరు ఖతార్ నేషనల్ విజన్ 2030 లక్ష్యాలతో, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. 2025 జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇన్వర్డ్ మరియు అవుట్వర్డ్ FDI స్థానాల ప్రాథమిక అంచనాలను ఈ ఫలితాలు విశ్లేషించాయి. సర్వేలో సుమారు 200 ప్రైవేట్ రంగ సంస్థలతోపాటు ఎంపిక చేసిన ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల డేటాను పరిగణనలోకి తీసుకుని ఫలితాలను వెల్లడించారు.
2025 రెండవ త్రైమాసికంతో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికం చివరిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) స్థానాలు 7% పెరిగి, సుమారు QR157 బిలియన్లకు చేరుకున్నాయని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.మైనింగ్ మరియు క్వారీయింగ్ 44%, ఆర్థిక మరియు భీమా కార్యకలాపాలు 32%, తయారీ 15%, శాస్త్రీయ మరియు సాంకేతిక కార్యకలాపాలు 5% మరియు ప్రజా పరిపాలన 2% చోప్పున నమోదు కాగా..ఈ ముఖ్యమైన ఐదు రంగాలలో 95% కంటే ఎక్కువ FDI వచ్చాయని జాతీయ ప్రణాళిక మండలి డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









