జింబాబ్వే పై భారత్ ఘన విజయం

- February 26, 2026 , by Maagulf
జింబాబ్వే పై భారత్ ఘన విజయం

T20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమ్ ఇండియా తన ప్రతాపాన్ని చూపింది. అత్యంత కీలకమైన, తప్పక గెలవాల్సిన పోరులో జింబాబ్వేపై 72 పరుగుల భారీ తేడాతో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్ రేసులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి జింబాబ్వేను చిత్తు చేసింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ భారీ లక్ష్యం జింబాబ్వేకు ఆదిలోనే పెద్ద సవాల్‌గా మారింది.

తొలుత భారీ స్కోర్ సాధించిన భారత జట్టు..అనంతరం జింబాబ్వేను 184 పరుగులకు పరిమితం చేసింది. దీంతో సెమీస్ ఆశలను నిలుపుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.

రెండు జట్ల ప్లేయింగ్ 11..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com