జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- February 26, 2026
T20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమ్ ఇండియా తన ప్రతాపాన్ని చూపింది. అత్యంత కీలకమైన, తప్పక గెలవాల్సిన పోరులో జింబాబ్వేపై 72 పరుగుల భారీ తేడాతో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్ రేసులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి జింబాబ్వేను చిత్తు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ భారీ లక్ష్యం జింబాబ్వేకు ఆదిలోనే పెద్ద సవాల్గా మారింది.
తొలుత భారీ స్కోర్ సాధించిన భారత జట్టు..అనంతరం జింబాబ్వేను 184 పరుగులకు పరిమితం చేసింది. దీంతో సెమీస్ ఆశలను నిలుపుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









