అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- February 27, 2026
యూఏఈః బిగ్ టికెట్ అబుదాబి తన మూడవ ఫిబ్రవరి వీక్లీ ఇ-డ్రాను నిర్వహించింది. ఇందులో ఇండియా, బంగ్లాదేశ్ లకు చెందిన నలుగురు విజేతలుగా నిలిచారు. ప్రతి విజేతకు Dh50,000 లభించింది. విజేతలలో భారతదేశానికి చెందిన గోపకుమార్ దివాకరన్ పిళ్లై ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసి విజేతగా నిలిచారు.మరో విజేత అయిన హైదరాబాద్కు చెందిన షార్జా నివాసి సంధ్యా ప్రదీప్ తన గ్రూపులోని 20 మందితో బహుమతిని పంచుకోనున్నట్లు తెలిపారు.
ఇక 1987 నుండి అజ్మాన్లో నివసిస్తున్న 55 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడు మొహమ్మద్ రాణా సురుజ్జామాన్ విజేతగా నిలిచాడు. అలాగే, అల్ ఐన్లో నివసిస్తున్న బంగ్లాదేశ్కు చెందిన 29 ఏళ్ల MD జమిల్ హొస్సేన్ మరో విజేతగా నిలిచాడు. బహుమతిని 14 మంది స్నేహితులతో పంచుకుంటానన్న జమిల్.. బిగ్ టికెట్ డ్రాల్లోకి పాల్గొనడం కొనసాగించాలని యోచిస్తున్నట్లు చెప్పాడు. కాగా, మార్చి 3న 15 మిలియన్ల దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ డ్రాను లైవ్ లో నిర్వహించనున్నారు. ఈ గ్రాండ్ ప్రైజ్తో పాటు ఐదు కన్సోలేషన్ బహుమతుల కింద ఒక్కొక్కరికి 100,000 దిర్హామ్ల చొప్పున అందజేయనున్నా తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









