అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- February 27, 2026
యూఏఈః బిగ్ టికెట్ అబుదాబి తన మూడవ ఫిబ్రవరి వీక్లీ ఇ-డ్రాను నిర్వహించింది. ఇందులో ఇండియా, బంగ్లాదేశ్ లకు చెందిన నలుగురు విజేతలుగా నిలిచారు. ప్రతి విజేతకు Dh50,000 లభించింది. విజేతలలో భారతదేశానికి చెందిన గోపకుమార్ దివాకరన్ పిళ్లై ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసి విజేతగా నిలిచారు.మరో విజేత అయిన హైదరాబాద్కు చెందిన షార్జా నివాసి సంధ్యా ప్రదీప్ తన గ్రూపులోని 20 మందితో బహుమతిని పంచుకోనున్నట్లు తెలిపారు.
ఇక 1987 నుండి అజ్మాన్లో నివసిస్తున్న 55 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడు మొహమ్మద్ రాణా సురుజ్జామాన్ విజేతగా నిలిచాడు. అలాగే, అల్ ఐన్లో నివసిస్తున్న బంగ్లాదేశ్కు చెందిన 29 ఏళ్ల MD జమిల్ హొస్సేన్ మరో విజేతగా నిలిచాడు. బహుమతిని 14 మంది స్నేహితులతో పంచుకుంటానన్న జమిల్.. బిగ్ టికెట్ డ్రాల్లోకి పాల్గొనడం కొనసాగించాలని యోచిస్తున్నట్లు చెప్పాడు. కాగా, మార్చి 3న 15 మిలియన్ల దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ డ్రాను లైవ్ లో నిర్వహించనున్నారు. ఈ గ్రాండ్ ప్రైజ్తో పాటు ఐదు కన్సోలేషన్ బహుమతుల కింద ఒక్కొక్కరికి 100,000 దిర్హామ్ల చొప్పున అందజేయనున్నా తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







