ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- February 27, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అధికారి జి.సాయిప్రసాద్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. రేపు ఉదయం సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. 1991 బ్యాచ్కు చెందిన ఈయన, పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
సాయిప్రసాద్ తన వృత్తి జీవితాన్ని 1992లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రారంభించారు. ఆ తర్వాత పాడేరు వంటి గిరిజన ప్రాంతాల్లో పనిచేసి క్షేత్రస్థాయి సమస్యలపై పట్టు సాధించారు.గుంటూరు మున్సిపల్ కమిషనర్గా, కడప జాయింట్ కలెక్టర్గా, కర్నూలు జిల్లా కలెక్టర్గా ఆయన సేవలందించారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆయన, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనలో సమర్థవంతంగా ఉపయోగిస్తారు. సుదీర్ఘ కాలంగా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎంతో ఉపయోగపడనుంది.
పరిపాలనతో పాటు విద్యుత్, గృహనిర్మాణం, జలవనరుల శాఖల్లో సాయిప్రసాద్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏపీ ట్రాన్స్కో, ఈపీడీసీఎల్ వంటి సంస్థలకు సారథ్యం వహించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖలోనూ పనిచేశారు. 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా ఉండి రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం అయ్యారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, ఇప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించే అత్యున్నత పదవిని అధిరోహించబోతున్నారు.
తాజా వార్తలు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!









