ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- February 28, 2026
కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో మహమ్మదీయసోదరులు ఎంతో నిష్టతో ఉండే ఉపవాస దీక్షల సందర్భంగా ఇఫ్తార్ విందును కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన కంచన రెడ్డి శేఖర్ మరియు పటాన్ ఖాదర్ ఖాన్ లు ఏర్పాటు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో ఉన్న ఒమేరియా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కువైట్లోని పలు ప్రాంతాల నుండి వందల సంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సుధాకర రావు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన మహమ్మదీయ సోదరులకు రమదాన్ మాస శుభాకాంక్షలు తెలియచేశారు.రమదాన్ మాసం అందరిలోను క్రమశిక్షణ, సహనం, మరియు దైవభక్తిని పెంపొందించే పవిత్ర మాసం.రమదాన్ శాంతి, సోదరభావం అనే సందేశాన్ని మరియు మానవాళికి హితాన్ని బోధిస్తుంది.ఈ నెలలో అందరూ ఇతరుల పట్ల దయ, సానుభూతి, మరియు ప్రేమను ప్రదర్శిస్తారు అని అన్నారు.
అధ్యక్షుడు ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీల పక్షపాత పార్టీ అనీ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పధకాలను మైనార్టీలకోసం ప్రవేశపెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టిడిపి గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు, ఎన్నరై టిడిపి కువైట్ అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు, ఎన్నారై టిడిపి సీనియర్ నాయకులు మాలేపాటి సురేష్ బాబు నాయుడు, సుగవాసి యువసేన అధ్యక్షుడు కంచన రెడ్డి శేఖర్, ఎన్నరై టిడిపి మైనార్టీ నాయకుదు పటాన్ ఖాదర్ ఖాన్, కొల్లి ఆంజనేయులు, ఖాదరున్, వేణు రాజు,బిల్లా రమేష్, గాజులపల్లి సుబ్బారెడ్డి, తిరుపతి రాజు, జిలాని బాషా, సుబ్బు, మహేష్ కోడూరి, చిన్నా రాజు, గల్ఫ్ జనసేన నాయకులు గల్ఫ్ జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్, కువైట్ కన్వీనర్ ఆంజన కుమార్ పగడాల,ఆకుల రాజేష్, కువైట్ కో-కన్వీనర్స్ జగిలి ఓబులేష్,ఆలి షేక్,ఇమ్మిడిసెట్టి సూర్యనారయణ, ప్రేం రాయల్, చంద్రశెఖర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









