ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- February 28, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా, తమ జ్ఞానం మరియు ప్రతిభను ప్రదర్శించేందుకు లభించిన మంచి అవకాశంగా భావించాలని ఆయన సూచించారు.
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో పరీక్షలను ఎదుర్కోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ తమ అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని సూచించారు. ఆత్మవిశ్వాసమే విజయానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థుల విజయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గవర్నర్ ప్రశంసించారు.వారి ప్రోత్సాహం, మార్గనిర్దేశం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









