పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- February 28, 2026
యూఏఈ: దుబాయ్లో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సేవలను అందించే అతిపెద్ద ప్రొవైడర్ అయిన పార్కిన్ కంపెనీ దుబాయ్ లో ఫీజులను పెంచనుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్టీఏతో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందానికి అనుగుణంగా, నగరంలో పార్కింగ్ టారిఫ్లను పెంచడానికి దరఖాస్తును సమర్పించినట్లు పార్కిన్ లోని ఒక సీనియర్ అధికారి చెప్పడం ఫీజుల పెంపునకు సంబంధించి ఊహాగానాలకు తెరలేపింది.
"RTAతో మా కన్సెషన్ ఒప్పందం ప్రకారం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టారిఫ్ సర్దుబాటును అభ్యర్థించాల్సిన బాధ్యత మాకు ఉంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి నెలకు రెండేళ్లు పూర్తవుతుంది. కన్సెషన్ ఒప్పందం ప్రకారం పని చేస్తున్నాము. ధరలను పెంచడం లేదా గోప్యంగా పెట్టడం దీని ఉద్దేశ్యం కాదు," అని పార్కిన్ CEO ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ స్పష్టం చేశారు.అయితే, అధికారుల ఆమోదానికి లోబడి రేట్లు పెరుగుతాయని ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.తాము పారదర్శకంగా ఉన్నామమని, తాము కొత్త రేట్లను నిర్ణయిస్తే తమ కస్టమర్లకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికంలో దుబాయ్లో పెయిడ్ పార్కింగ్ సగటు గంట ఖర్చు 51 శాతం పెరిగింది. జూలై-సెప్టెంబర్ 2025లో వెయిటెడ్ సగటు గంట టారిఫ్ Dh2.01 నుంచి Dh3.03కి పెరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా నేషనల్ హెల్త్ సర్వే ప్రారంభం..!!
- యుద్ధాన్ని పూర్తిగా ముగించడంపైనే ఫోకస్.. ఖతార్
- ప్రభుత్వ పాఠశాలల కోసం ఐబీ (IB) ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- ప్రాంతీయ పరిణామాలపై ఒమన్,ఖతార్ చర్చలు..!!
- Dh25,000 చొప్పున బహుమతి గెలిచిన నలుగురు భారతీయ ప్రవాసులు..!!
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!









