పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- February 28, 2026
యూఏఈ: దుబాయ్లో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సేవలను అందించే అతిపెద్ద ప్రొవైడర్ అయిన పార్కిన్ కంపెనీ దుబాయ్ లో ఫీజులను పెంచనుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్టీఏతో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందానికి అనుగుణంగా, నగరంలో పార్కింగ్ టారిఫ్లను పెంచడానికి దరఖాస్తును సమర్పించినట్లు పార్కిన్ లోని ఒక సీనియర్ అధికారి చెప్పడం ఫీజుల పెంపునకు సంబంధించి ఊహాగానాలకు తెరలేపింది.
"RTAతో మా కన్సెషన్ ఒప్పందం ప్రకారం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టారిఫ్ సర్దుబాటును అభ్యర్థించాల్సిన బాధ్యత మాకు ఉంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి నెలకు రెండేళ్లు పూర్తవుతుంది. కన్సెషన్ ఒప్పందం ప్రకారం పని చేస్తున్నాము. ధరలను పెంచడం లేదా గోప్యంగా పెట్టడం దీని ఉద్దేశ్యం కాదు," అని పార్కిన్ CEO ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ స్పష్టం చేశారు.అయితే, అధికారుల ఆమోదానికి లోబడి రేట్లు పెరుగుతాయని ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.తాము పారదర్శకంగా ఉన్నామమని, తాము కొత్త రేట్లను నిర్ణయిస్తే తమ కస్టమర్లకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికంలో దుబాయ్లో పెయిడ్ పార్కింగ్ సగటు గంట ఖర్చు 51 శాతం పెరిగింది. జూలై-సెప్టెంబర్ 2025లో వెయిటెడ్ సగటు గంట టారిఫ్ Dh2.01 నుంచి Dh3.03కి పెరిగింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









