పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- February 28, 2026
యూఏఈ: దుబాయ్లో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సేవలను అందించే అతిపెద్ద ప్రొవైడర్ అయిన పార్కిన్ కంపెనీ దుబాయ్ లో ఫీజులను పెంచనుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్టీఏతో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందానికి అనుగుణంగా, నగరంలో పార్కింగ్ టారిఫ్లను పెంచడానికి దరఖాస్తును సమర్పించినట్లు పార్కిన్ లోని ఒక సీనియర్ అధికారి చెప్పడం ఫీజుల పెంపునకు సంబంధించి ఊహాగానాలకు తెరలేపింది.
"RTAతో మా కన్సెషన్ ఒప్పందం ప్రకారం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టారిఫ్ సర్దుబాటును అభ్యర్థించాల్సిన బాధ్యత మాకు ఉంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి నెలకు రెండేళ్లు పూర్తవుతుంది. కన్సెషన్ ఒప్పందం ప్రకారం పని చేస్తున్నాము. ధరలను పెంచడం లేదా గోప్యంగా పెట్టడం దీని ఉద్దేశ్యం కాదు," అని పార్కిన్ CEO ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ స్పష్టం చేశారు.అయితే, అధికారుల ఆమోదానికి లోబడి రేట్లు పెరుగుతాయని ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.తాము పారదర్శకంగా ఉన్నామమని, తాము కొత్త రేట్లను నిర్ణయిస్తే తమ కస్టమర్లకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికంలో దుబాయ్లో పెయిడ్ పార్కింగ్ సగటు గంట ఖర్చు 51 శాతం పెరిగింది. జూలై-సెప్టెంబర్ 2025లో వెయిటెడ్ సగటు గంట టారిఫ్ Dh2.01 నుంచి Dh3.03కి పెరిగింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







