నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- February 28, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్ కి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (కనకదుర్గమ్మ ఆలయం) తరపున అర్చకులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు.
ఈరోజు ఉదయం ఏపీ సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ నేతృత్వంలోని అర్చక బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆలయ స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ మరియు ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక బృందం నూతన సీఎస్కు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీస్సులు అందజేశారు.
ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి, శ్రీ అమ్మ వారి కృపాకటాక్షాలుతో రాష్ట్ర అభివృద్ధిలో సాయి ప్రసాద్ వారి సేవలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









