యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- March 01, 2026
జెడ్డాః ఇరాన్ దాడులకు గురైన యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంఘీభావరం ప్రకటించారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని, కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు జోర్డాన్ రాజు అబ్దుల్లా II లతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దారుణమైన దాడులకు ప్రతిస్పందనగా వారు తీసుకునే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వడానికి సౌదీ అరేబియా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









