యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- March 02, 2026
అబుదాబి: యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సంస్థ ప్రకటించింది. డేటా సెంటర్పై కొన్ని వస్తువులు పడటంతో చిమ్మర్లు చెలరేగి మంటలు చెలరేగినట్లు కంపెనీ వెల్లడించింది.
మార్చి 1న ఉదయం 5:19 గంటలకు (PST) విడుదల చేసిన హెల్త్ డ్యాష్బోర్డ్ అప్డేట్లో, ME-CENTRAL-1 రీజియన్లోని ఒకే ఒక్క అవైలబిలిటీ జోన్ (mec1-az2)లో స్థానిక విద్యుత్ సమస్య కారణంగా APIలు మరియు ఇన్స్టాన్స్లకు కనెక్టివిటీ, పవర్ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.
తదుపరి అప్డేట్లో, సుమారు ఉదయం 4:30 గంటల (PST) సమయంలో mec1-az2 అవైలబిలిటీ జోన్పై వస్తువులు పడటంతో మంటలు చెలరేగాయని తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో డేటా సెంటర్కు మరియు జనరేటర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని వెల్లడించింది.
“విద్యుత్ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నాం. అనుమతి లభించిన వెంటనే సురక్షితంగా పవర్ మరియు కనెక్టివిటీని పునరుద్ధరిస్తాం. ప్రభావిత అవైలబిలిటీ జోన్లో సేవలు పూర్తిగా పునరుద్ధరించేందుకు కొన్ని గంటలు పట్టవచ్చు. ఇతర అవైలబిలిటీ జోన్లు సాధారణంగా పనిచేస్తున్నాయి,” అని సంస్థ తెలిపింది.
అదనంగా, కొంతమంది వినియోగదారులు EC2 APIలలో, ముఖ్యంగా నెట్వర్కింగ్కు సంబంధించిన APIలు (AllocateAddress, AssociateAddress, DescribeRouteTable, DescribeNetworkInterfaces) వినియోగంలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు AWS తెలిపింది. సమస్యలను పరిష్కరించేందుకు పలు మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
మార్చి 2 ఉదయం వరకు విద్యుత్ పునరుద్ధరణకు ఖచ్చితమైన సమయం (ETA) తెలియదని కంపెనీ వెల్లడించింది. వీలైతే వినియోగదారులు ప్రత్యామ్నాయ అవైలబిలిటీ జోన్లు లేదా ఇతర AWS రీజియన్లను ఉపయోగించుకోవాలని సూచించింది.
తదుపరి అప్డేట్లో ME-CENTRAL-1 రీజియన్లో అదనపు కనెక్టివిటీ సమస్యలు మరియు లోపాల రేట్లపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు AWS తెలిపింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







