గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- March 02, 2026
అమరావతి: గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (AP NRTS) కో-ఆర్డినేటర్ల ద్వారా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తాత్కాలిక వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన ఆహారం, నివాసం, ప్రాథమిక అవసరాల ఏర్పాట్లతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే ఏపీ NRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్ 0863-2340678 కు సంప్రదించవచ్చని, అలాగే వాట్సాప్ ద్వారా +91 85000 27678 నంబర్కు సమాచారం పంపవచ్చని మంత్రి సూచించారు. అదేవిధంగా [email protected] ఈమెయిల్ ద్వారా కూడా సహాయం కోరవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతి తెలుగు పౌరుడి భద్రతకు కట్టుబడి ఉందని, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









