గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- March 02, 2026
అమరావతి: గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (AP NRTS) కో-ఆర్డినేటర్ల ద్వారా గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తాత్కాలిక వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన ఆహారం, నివాసం, ప్రాథమిక అవసరాల ఏర్పాట్లతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే ఏపీ NRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్ 0863-2340678 కు సంప్రదించవచ్చని, అలాగే వాట్సాప్ ద్వారా +91 85000 27678 నంబర్కు సమాచారం పంపవచ్చని మంత్రి సూచించారు. అదేవిధంగా [email protected] ఈమెయిల్ ద్వారా కూడా సహాయం కోరవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రతి తెలుగు పౌరుడి భద్రతకు కట్టుబడి ఉందని, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







