అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- March 02, 2026
అబుదాబి: గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్న డ్రోన్ల అవశేషాలు అబుదాబిలోని ఐక్యాద్ (ICAD) ప్రాంతంలోని ఒక గిడ్డంగి మరియు ముసఫ్ఫా ప్రాంతంలోని వాణిజ్య వేర్హౌస్ పై పడ్డాయని అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర స్పందనా బృందాలు సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
అవశేషాలు పడ్డ ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో పాటు సంబంధిత శాఖలు సమగ్ర సమీక్ష చేపట్టాయి.ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాల పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారం మాత్రమే విశ్వసించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అధికారిక చానెల్స్ ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు. అపోహలు, నిర్ధారణ కాని వార్తలను పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









