నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- March 02, 2026
కువైట్: కువైట్ లోని నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) మరియు కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (KIPIC) లకు చెందిన అల్-అహ్మది రిఫైనరీపై ఇరాన్ దాడి చేసిందని వాటి అధికారిక ప్రతినిధి ఘనేమ్ అల్-ఒతైబి తెలిపారు. డ్రోన్ లేదా మిస్సైల్ శిథిలాలు పడి ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. గాయపడిన ఉద్యోగులను చికిత్స కోసం అల్-అదాన్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
అయితే, రిఫైనరీ ఉత్పత్తి మరియు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపారు. రెస్క్యూ టీమ్స్ సమస్యను వెంటనే పరిష్కరించాయని అన్నారు. సిబ్బంది మరియు సౌకర్యాలను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మినా అల్-అహ్మది రిఫైనరీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని, కార్మికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









