నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- March 02, 2026
కువైట్: కువైట్ లోని నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) మరియు కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (KIPIC) లకు చెందిన అల్-అహ్మది రిఫైనరీపై ఇరాన్ దాడి చేసిందని వాటి అధికారిక ప్రతినిధి ఘనేమ్ అల్-ఒతైబి తెలిపారు. డ్రోన్ లేదా మిస్సైల్ శిథిలాలు పడి ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. గాయపడిన ఉద్యోగులను చికిత్స కోసం అల్-అదాన్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
అయితే, రిఫైనరీ ఉత్పత్తి మరియు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపారు. రెస్క్యూ టీమ్స్ సమస్యను వెంటనే పరిష్కరించాయని అన్నారు. సిబ్బంది మరియు సౌకర్యాలను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మినా అల్-అహ్మది రిఫైనరీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని, కార్మికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







