ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- March 03, 2026
మనామా: బహ్రెయిన్లోని ఫాల్స్ కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న పలువురిని సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమాజ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే తీవ్రమైన నేరాలకు పాల్పడినందుకు అనేక మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
ఇరాన్ దాడులకు సానుభూతి చూపేలా వీడియోలు మరియు కంటెంట్ వ్యాప్తి చేయడం ఉల్లంఘనలలో ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి చర్యలు దేశ ద్రోహం కిందకు వస్తుందని హెచ్చరించింది. ఏఐ టెక్నాలజీ సాయంతో ఇళ్లను నాశనం చేస్తున్నట్లు చిత్రీకరించిన కల్పిత ఫోటోలను కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టించాయని, పౌరులు మరియు నివాసితులలో భయాన్ని వ్యాప్తి చేశాయని, ఇది ప్రజా భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, అరెస్టు చేసిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారిక వనరుల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని సూచించింది. నమ్మదగని కంటెంట్ను తిరిగి పోస్ట్ చేయడం మానుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!









