ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- March 03, 2026
మనామా: బహ్రెయిన్లోని ఫాల్స్ కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న పలువురిని సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమాజ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే తీవ్రమైన నేరాలకు పాల్పడినందుకు అనేక మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
ఇరాన్ దాడులకు సానుభూతి చూపేలా వీడియోలు మరియు కంటెంట్ వ్యాప్తి చేయడం ఉల్లంఘనలలో ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి చర్యలు దేశ ద్రోహం కిందకు వస్తుందని హెచ్చరించింది. ఏఐ టెక్నాలజీ సాయంతో ఇళ్లను నాశనం చేస్తున్నట్లు చిత్రీకరించిన కల్పిత ఫోటోలను కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టించాయని, పౌరులు మరియు నివాసితులలో భయాన్ని వ్యాప్తి చేశాయని, ఇది ప్రజా భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, అరెస్టు చేసిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారిక వనరుల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని సూచించింది. నమ్మదగని కంటెంట్ను తిరిగి పోస్ట్ చేయడం మానుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







