ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- March 03, 2026
మనామా: బహ్రెయిన్లోని ఫాల్స్ కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న పలువురిని సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమాజ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే తీవ్రమైన నేరాలకు పాల్పడినందుకు అనేక మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.
ఇరాన్ దాడులకు సానుభూతి చూపేలా వీడియోలు మరియు కంటెంట్ వ్యాప్తి చేయడం ఉల్లంఘనలలో ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి చర్యలు దేశ ద్రోహం కిందకు వస్తుందని హెచ్చరించింది. ఏఐ టెక్నాలజీ సాయంతో ఇళ్లను నాశనం చేస్తున్నట్లు చిత్రీకరించిన కల్పిత ఫోటోలను కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టించాయని, పౌరులు మరియు నివాసితులలో భయాన్ని వ్యాప్తి చేశాయని, ఇది ప్రజా భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, అరెస్టు చేసిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారిక వనరుల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని సూచించింది. నమ్మదగని కంటెంట్ను తిరిగి పోస్ట్ చేయడం మానుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









