హౌతీ దాడుల్లో నజ్రాన్‌లో 11 మంది పౌరులకు గాయాలు..!!

- August 07, 2026 , by Maagulf
హౌతీ దాడుల్లో నజ్రాన్‌లో 11 మంది పౌరులకు గాయాలు..!!

రియాద్: యెమెన్‌లోని హౌతీ మిలీషియా జరిపిన దాడుల్లో సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతమైన నజ్రాన్‌లో 11 మంది పౌరులు గాయపడినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా ఏర్పాటైన కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ శుక్రవారం వెల్లడించారు. గాయపడిన వారిలో ఏడుగురు సౌదీ పౌరులు ఉన్నారు. వీరిలో ఒక మహిళ, నాలుగేళ్ల చిన్నారి కూడా ఉన్నారని తెలిపారు. అలాగే ఒక యెమెన్ నివాసి, ఇద్దరు ఈజిప్టు వాసులు, ఒక పాకిస్థాన్ నివాసి కూడా గాయపడినట్లు పేర్కొన్నారు.

హౌతీ మిలీషియా పౌర లక్ష్యాలపై విచక్షణారహితంగా ఈ దాడులకు పాల్పడిందన్నారు. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాలను, వాటి సాంప్రదాయ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇలాంటి ఉగ్రదాడులను అడ్డుకునేందుకు, పౌరుల భద్రతను కాపాడేందుకు కూటమి సంయుక్త దళాలు అవసరమైన నిరోధక చర్యలను కొనసాగిస్తాయని మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com