సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

- March 08, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

రియాద్: సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ నగరంలోని నివాస ప్రాంతంలో ఆదివారం ఒక క్షిపణి (ప్రాజెక్టైల్) పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.

సివిల్ డిఫెన్స్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో తెలిపిన వివరాల ప్రకారం, మృతి చెందిన ఇద్దరిలో ఒకరు భారతీయుడు కాగా మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన వారని వెల్లడించారు.

క్షిపణి పడటంతో నివాస ప్రాంతంలో తీవ్ర నష్టం సంభవించగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ సహా కొన్ని ప్రాంతాల్లో ఉన్న రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపింది.

ఈ ఘటన నేపథ్యంలో ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com