చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- March 08, 2026
అహ్మదాబాద్: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ లో న్యూజిలాండ్ పై అద్భుత విజయంతో వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. 96 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 256 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలవడం ఇది ముచ్చటగా మూడోసారి. తొలిసారి 2007లో, రెండోసారి 2024లో, ఇప్పుడు 2026లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్గా కొత్త చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









