వంటగ్యాస్ పై రాయితీ పెంపు
- August 01, 2016
సబ్సిడీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై మరోసారి ధరల మోత మోగించింది. రాయితీ సిలిండర్పై రూ.1.93 పెంచుతున్నట్లు ప్రకటించింది. నెల వ్యవధిలో రాయితీ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. జులై 1న సబ్సిడీ ఎల్పీజీపై రూ.1.98 పెంచిన విషయం తెలిసిందే. నూతన నిర్ణయం ప్రకారం దిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ.423.09గా ఉంది.
వంటగ్యాస్, కిరోసిన్ రాయితీలను తగ్గించేందుకు ప్రభుత్వం నెలవారీగా ధరలను పెంచే పద్ధతిని చేపట్టింది. ఇప్పటికే ప్రతినెలా లీటర్ కిరోసిన్పై రూ.25 పెంచాలని నిర్ణయించగా.. తాజాగా రాయితీ వంటగ్యాస్పై కూడా దాదాపు రూ.2 పెంచేందుకు సిద్ధమైంది. మరోవైపు సబ్సిడీయేతర గ్యాస్ ధరలను మాత్రం సదరు చమురు కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో రూ.11 తగ్గించగా.. తాజాగా 14.2 కిలోల సిలిండర్ ధరపై రూ.50.5 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.487గా ఉంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







