తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- March 12, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ (HYD) సహా వివిధ జిల్లా కేంద్రాల్లోని రహదారులపై జన సంచారం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు కూడా కచ్చితంగా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎవరికీ మినహాయింపు ఉండదని.. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు తెరిచి ఉండటానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి.. వేసవి సెలవులపై కూడా తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది.ఏఫ్రిల్ 23 స్కూళ్లకు చివరి పని దినం కాగా.. ఏఫ్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









