ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- March 12, 2026
కౌలాలంపూర్: ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది.అది ఇప్పుడు వచ్చే నెల ఏప్రిల్ 30, 2026 కి ముగుస్తుంది.ఈ గడువు లోపు పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు,వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళినట్లయితే వారు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా భారత్కు వెళ్ళవచ్చు.
ఈ ఆమ్నెస్టీ ద్వారా తమ స్వదేశాలకు వెళ్లే వారు 500 రింగ్గిట్ మలేషియా (ఇండియన్ కరెన్సి లో రూ.10000) చెలించాల్సివుంది.అలాగే వారు పాసుపోర్టు, పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ మరియు సొంతంగా వారం రోజుల్లో వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కు చెందిన భారతీయ కార్మికులు మలేషియా లో పనిచేస్తున్నారు, ఇక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్రమ కార్మికులుగా నివసిస్తున్నారు . ఏజంట్లు మంచి జీతం తో కూడిన ఉద్యోగం ఇస్తామని ఆశ చూపి ఈ కార్మికులను విజిట్ వీసా పైన తీసుకువచ్చి వర్క్ పర్మిట్ ఇవ్వకుండా మోస పోయిన వారు చాల మంది వున్నారు. ఈ కార్మికులు ఎక్కువగా పామ్ ఆయిల్ తోటలలో, రబ్బర్ తోటలలో, కన్స్ట్రక్షన్ మరియు హోటల్స్ ల లో పని చేస్తున్నారు.
ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని వాడుకోని వారిపై మలేషియా అధికారులు కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.గడువు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారులను గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి అరెస్ట్ అయితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు.
ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదయినా సహాయం కావలసినవారు ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్, మలేషియాను [email protected] or http://website www.fnca.com.my సంప్రదించాలని ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు.


తాజా వార్తలు
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!









