బ్రెజిల్లో విమానం కూలి ఎనిమిది మంది మృతి
- August 01, 2016
విమానం కూలి ఎనిమిది మంది దుర్మరణం చెందిన ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. పైపర్ నవాజో జెట్ విమానం పరానా రాష్ట్రంలోని క్యాంబే ప్రాంతంలో ఉన్న ఎక్సలెన్స్ రవాణా శాఖ భవనంపై కూలిపోయింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి అందులోని 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఓ చర్చి కూడా ఉందని, ఆసమయంలో అందులో 300 మంది ప్రార్థనలు చేస్తున్నారని, అదృవశాత్తు వారికి ఏమీ కాలేదని స్థానికులు మీడియాకి తెలిపారు. జెట్లోని ప్రయాణికులంతా లోండ్రినా ప్రాంతంలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని, కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనగా ఘోరం జరిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా బ్రెజీలియన్ యూనియన్ ఆఫ్ కోఆపరేటీవ్స్ ఫెనాట్రోకాప్ అధ్యక్షుడు మౌరీ వియానాకి బంధువులని తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







