కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- March 15, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శనివారం ఒక ప్రకటన చేసింది. పీఎన్జీతో పాటు ఎల్పీజీ కనెక్షన్ కూడా ఉంటే.. ఆ వినియోగదారులు వెంటనే తమ ఎల్పీజీ కనెక్షన్ను తక్షణమే సరెండర్ చేయాలని సూచించింది.అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు, వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ (LPG) సిలిండర్ రీఫిల్ తీసుకోవద్దని కూడా సూచించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు పీఎన్జీ (PNG) వినియోగదారులు కొత్తగా డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవడాన్ని కూడా నిషేధించారు.
నివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇలా పేర్కొన్నారు: “పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి, అదే సమయంలో డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ను కొనసాగించకూడదు. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి లేదా వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ కూడా తీసుకోకూడదు. అలాంటి వారు తమ ఎల్పీజీ కనెక్షన్ను వెంటనే సరెండర్ చేయాలి.”
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల మీద పడుతోంది. ఇప్పటికే చాలా హోటళ్లు అధిక గ్యాస్ వినియోగించుకునే వంటలను మెనూ నుంచి తొలగించాయి.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









