iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- March 22, 2026
దోహా, ఖతార్: iOSలో కొన్ని భద్రతా లోపాల పై Apple ఒక హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో iPhone వినియోగదారులు తమ పరికరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఖతార్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ (NCSA) సూచించింది. ఈ భద్రతా లోపాలను వినియోగించుకోవడం ద్వారా హ్యాకర్లు కేవలం ఒక హానికరమైన వెబ్సైట్ను సందర్శించడం లేదా వైరస్ సోకిన లింక్లపై క్లిక్ చేయడం ద్వారానే గూఢచర్య కార్యకలాపాలను నిర్వహించవచ్చని, అలాగే పరికరాల నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకోవచ్చని Apple పేర్కొన్నట్లు NCSA తెలిపింది.
గత కొన్ని నెలల్లో తాము అనేక భద్రతా అప్డేట్లను విడుదల చేశామని, వాటిలో తాజా అప్డేట్ మార్చి 11న వచ్చిందని ఆ సంస్థ (Apple) తెలిపింది. iOS 15 నుండి iOS 26 వరకు ఉన్న కొత్త వెర్షన్లపై పనిచేస్తున్న పరికరాలు ఇప్పుడు ఈ దాడుల నుండి రక్షణ పొందుతాయని అన్నారు. అయితే, ఇటీవల కాలంలో iOS 13 మరియు iOS 14 వంటి పాత వెర్షన్లపై ఇంకా పనిచేస్తున్న పరికరాలు లక్ష్యంగా మారుతున్నట్లు తెలిపారు. ఈ సమస్యను వేగంగా పరిష్కరించేందుకు గాను, రాబోయే రోజుల్లో ఈ పాత వెర్షన్లకు కూడా భద్రతా అప్డేట్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామని ఆ సంస్థ (NCSA) పేర్కొంది. భద్రతా అప్డేట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలని, అలాగే తెలియని వనరుల నుండి వచ్చే అనుమానాస్పద లింకులు లేదా సందేశాలను తెరవవద్దని వినియోగదారులను ఆ సంస్థ మరింతగా హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







