వైఎస్సార్ సీపీ నేతకు గాయాలు

- August 03, 2016 , by Maagulf
వైఎస్సార్ సీపీ నేతకు గాయాలు

 పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు- ఆచంట రహదారిలో జరిగిన రోడ్డుప్రమాదంలో కారు బోల్తా పడి ఆచంటకు చెందిన వైఎస్సార్ సీపీ నేతకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆచంటకు చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్ బంద్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.అనంతరం పెనుమంట్రలో పోలీసులు అరెస్ట్ చేసిన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ కవురు శ్రీనివాసుకు సంఘీంభావం తెలిపేందుకు ఆయన తన అనుచరులతో కలిసి కారులో వెళ్తున్నారు. ఇంతలో మార్టేరుకు సమీపంలో ఓఎన్‌జీసీ పనులు చేస్తున్న చోట కారు అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో కిశోర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదం విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి నియోజకవర్గ కన్వీనరు కవురు శ్రీనివాసు, నాయకులు కర్రి వేణుబాబు, అల్లం భాస్కరరెడ్డి, ఉన్నమట్ల మునిబాబు చేరుకుని కిశోర్‌ను ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com