వైఎస్సార్ సీపీ నేతకు గాయాలు
- August 03, 2016
పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు- ఆచంట రహదారిలో జరిగిన రోడ్డుప్రమాదంలో కారు బోల్తా పడి ఆచంటకు చెందిన వైఎస్సార్ సీపీ నేతకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆచంటకు చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల కిషోర్ బంద్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.అనంతరం పెనుమంట్రలో పోలీసులు అరెస్ట్ చేసిన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ కవురు శ్రీనివాసుకు సంఘీంభావం తెలిపేందుకు ఆయన తన అనుచరులతో కలిసి కారులో వెళ్తున్నారు. ఇంతలో మార్టేరుకు సమీపంలో ఓఎన్జీసీ పనులు చేస్తున్న చోట కారు అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో కిశోర్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదం విషయం తెలిసి వెంటనే సంఘటనా స్థలానికి నియోజకవర్గ కన్వీనరు కవురు శ్రీనివాసు, నాయకులు కర్రి వేణుబాబు, అల్లం భాస్కరరెడ్డి, ఉన్నమట్ల మునిబాబు చేరుకుని కిశోర్ను ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







