యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- March 25, 2026
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తుమ్మలపల్లె ప్రాంతంలోని యురేనియం నిల్వల పై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. తాజా పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ఈ అంశం పై ప్రధానమంత్రిని వివరణ ఇవ్వాలని కోరారు.
ఎంపీ బాలశౌరి తన ప్రశ్నల్లో తుమ్మలపల్లెలో అదనంగా 4,400 టన్నుల యురేనియం నిల్వలు లభించాయా?లభించిన యురేనియం నాణ్యత (గ్రేడ్) 0.4 శాతంగా ఉందా? అలాగే అన్వేషణ ఎంత లోతు వరకు జరిగింది, నిల్వల వెలికితీత ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలను అడిగారు.
ఈ ప్రశ్నలకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖల సహాయ మంత్రి, అలాగే ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
అణుశక్తి శాఖకు చెందిన అణు ఖనిజాల అన్వేషణ మరియు పరిశోధన డైరెక్టరేట్ (AMD) 2024-25, 2025-26 సంవత్సరాల్లో తుమ్మలపల్లె యురేనియం నిక్షేపాల్లో సుమారు 4,400 టన్నుల ఇన్-సిటు యురేనియం ఆక్సైడ్ వనరును గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
అయితే యురేనియం సగటు నాణ్యత 0.4 శాతం ఉందన్న విషయాన్ని మంత్రి ఖండించారు.
యురేనియం వెలికితీతపై మాట్లాడుతూ, ‘అణు ఖనిజాల రాయితీ నియమాలు, 2016’ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గనుల లీజును మంజూరు చేసిన తర్వాతే తవ్వకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో తుమ్మలపల్లె యురేనియం నిల్వల అభివృద్ధి పై మరింత స్పష్టత ఏర్పడింది.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









