ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- March 26, 2026
యూఏఈః ‘దుబాయ్ నుండి సామూహిక తరలింపు’, ‘దుబాయ్ ఇక సురక్షితం కాదు’, ‘విమానాశ్రయాలు మూతపడ్డాయి’, ‘ నిత్యవసరాల షెల్ఫ్లు ఖాళీగా ఉన్నాయి’ వంటి ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న ఆందోళనకరమైన వార్తలన్ని ఫేక్ అని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు బాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫేక్ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఓ వీడియోను షేర్ చేసింది.
"వదంతులను నమ్మవద్దు, వాస్తవాలపై దృష్టి పెట్టండి" అని ఆ కార్యాలయం వీడియోతో పాటు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. "దుబాయ్ యథావిధిగా పనిచేస్తోంది. నకిలీ వార్తలతో తప్పుదోవ పట్టకండి. సమాచారం తెలుసుకోండి మరియు షేర్ చేసే ముందు ధృవీకరించుకోండి." పేర్కొంది.
బ్యాంకులు పెట్టుబడిదారుల నిధులను స్తంభింపజేస్తున్నాయని, ఆస్తి మార్కెట్ కుప్పకూలుతోందని, సంపన్న నివాసితులు, హెడ్జ్ ఫండ్లు ఎమిరేట్ నుండి పారిపోతున్నారని వంటి వైరల్ తరహా టైటిల్స్ ను ఒకచోట చేర్చి, అవి ఫేక్ వార్తలు అని వీడియోలో తేల్చిచెప్పింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు అధికంగా ఉన్న సమయాల్లో, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా హెచ్చరించింది. తాజా సమాచారం కోసం అధికారిక మూలాలపై మాత్రమే ఆధారపడాలని అధికారులు నివాసితులకు మరియు సోషల్ మీడియా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









